నిన్ను ఎందుకు నమ్మాలి సీఎం జగన్ రెడ్డి

జగన్ రెడ్డి

     విజయనగరం ( జనస్వరం ) : జనసేన పార్టీ విజయనగరం జిల్లా నాయకులు ఆధ్వర్యంలో ఈరోజు పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, మే 3న ముఖ్యమంత్రి YS జగన్ రెడ్డి విజయనగరం జిల్లా భోగాపురంలో విమానాశ్రాయ శంకుస్థాపనకు రావడం సిగ్గు చేటని, ఇంతకుముందే శంకుస్థాపన జరిగిన తరువాత మళ్ళీ అదే పనికోసం అదేచోట ఈయన శంకుస్థాపన కోసం రావడం విడ్డూరం కాకపోతే మరేమిటని జిల్లా నాయకులు ఏద్దేవా చేశారు. ఈ ముఖ్యమంత్రి కేవలం శంకుస్థాపనల ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారని, కేవలం బటన్ నొక్కుడు ముఖ్యమంత్రిని రాబోయే ఎన్నికల్లో ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు. ముఖ్యమంత్రి ఇకనైనా తీరు మార్చుకుని అనవసరమైన అర్భాటాలకు పోకుండా, ప్రజల సొమ్మును వృధా చేయకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చెయ్యాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్మాణ కార్యదర్శి బాబు పాలూరి, జిల్లా నాయకులు మర్రాపు సురేష్, ఆదాడ మోహన రావు, అక్కివరపు మోహన్ రావు, గుర్రన్న అయ్యలు , మిడతాన రవి కుమార్,రమేష్ రాజు, నర్సింగ్ రావు, టమ్మిగంటి సురి నాయుడు, అడ్డాల రామచంద్ర రాజు, రేగిడి లక్ష్మణరావు, తుమ్మి అప్పలరాజు దొర, బాలు, తవిటీ నాయుడు,రాజేష్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way