Search
Close this search box.
Search
Close this search box.

అంబరీష్ కుటుంబానికి అండగా ఉంటాం : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి

     ధర్మవరం, (జనస్వరం) :  ధర్మవరం పట్టణానికి చెందిన జనసేనపార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జింక అంబరీష్ ప్రమాదవశాత్తు మంగళవారం బత్తలపల్లి మండలం సంగమేశ్వరం దగ్గర ఉన్న చిత్రావతి నదిలో పడి మరణించడం జరిగింది. జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి బుధవారం జింక అంబరీష్ మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ వైద్యశాల మార్చురీ గది నుంచి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీగా వారి ఇంటి దగ్గరకు చేర్చారు. అనంతరం చిలకం మధుసూదన రెడ్డి దంపతులు జింక అంబరీష్ మృతదేహానికి నివాళులర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం చెప్పి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జింక అంబరీష్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. అంబరీష్ కుటుంబ సభ్యులకు జనసేనపార్టీ తరఫున అండగా ఉండి అన్ని రకాలుగా వారిని ఆదుకుంటామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, కార్యకర్తలు అంబరీష్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way