Search
Close this search box.
Search
Close this search box.

పేదల ఇళ్ళకు అండగా నిలబడింది మేమే : పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

కేతంరెడ్డి వినోద్ రెడ్డి

          నెల్లూరు సిటీ ( జనస్వరం ) :  జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 297వ రోజున 16వ డివిజన్ గుర్రాలమడుగుసంగంలో జరిగింది. ఈ ప్రాంతంలో ప్రతి ఇంటినీ సందర్శించి సమస్యలను అధ్యయనం చేసిన కేతంరెడ్డి ఆ సమస్యల పరిష్కారం దిశగా తమవంతు పోరాటం చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలో నాలుగు కాలువల బినామీ కాంట్రాక్టుల కోసం వందలాది పేదల ఇళ్ళను కూలగొట్టే చర్యలకు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పూనుకుంటే ఈ ప్రాంతంలో సర్వేపల్లి కాలువను ఆనుకుని ఉన్న పేదల నివాసాలు కూలకుండా హైకోర్టుకి వెళ్ళి ఆపింది తామేనని గుర్తు చేశారు. కోవిడ్ సమయంలో ఇక్కడ అనేకమంది పేదలకు నిత్యావసరాలు అందించిన విషయాన్ని స్థానికులు గుర్తుచేయగా, పేదలకు తాము ఎప్పుడూ అండగా నిలుస్తామని కేతంరెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో అందరూ పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలవాలని, పవనన్నని ముఖ్యమంత్రి చేసుకుందామని కేతంరెడ్డి కోరారు. పవనన్న ప్రభుత్వంలో నెల్లూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way