కొప్పరవలస గ్రామంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ

     రాజాం, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళటం కోసం రాజాం నియోజకవర్గం, వంగర మండలం, కొప్పరవలస గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణతో పాటుగా గ్రామ పర్యటన చేస్తూ బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించటం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా రాజాం నియోజవర్గ జనసేన నాయుకులు ఎన్ని రాజు వచ్చి జనసేన జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ ప్రజలను రక రకాల పథకాలు పేరు చెప్పి మభ్యపెడుతున్నారని, ఇటువంటి తిరోగమన కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ ని సీఎం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలను, జనసైనికులను కోరడం జరిగింది. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన జానీ, కిరణ్, అప్పలనాయుడు, అన్నం నాయుడు, శ్యామ్, రమేష్, యోగి, శ్రీను, కొప్పరవలస జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.