Search
Close this search box.
Search
Close this search box.

పేరంటాలపలెం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం

పేరంటాలపలెం

          అనకాపల్లి ( జనస్వరం ) ఈరోజు అనకాపల్లి నియోజకవర్గం కశింకోట మండలం పేరంటాలపలెం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గం ఇన్చార్జ్ పరుచూరి భాస్కరరావు గారు పాల్గొన్నారు. ఈ సంద్భంగా జరిగిన సభలో భాస్కరరావు గారు మాట్లాడుతూ గ్రామాల్లో ప్రతి ఇంటికీ జనసేన పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి జనసైనికుడిపై ఉంది అని అన్నారు. గ్రామాల్లో జనసైనికులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తప్పకుండా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సంద్భంగా పలువురు గ్రామస్థులు జనసేన పార్టీ లోకి చేరారు. వీరికి భాస్కరరావు గారు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండలం నాయకులు పావాడ కామరాజు, ఉత్తాడ రామరాజు, కలగా శ్రీనివాసరావు, గొంతిన ఈశ్వరరావు, కరణం రమణ, ఊడి నూకరాజు మరియు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way