‘మాట’కు అందని అభిమానం : బధిర యువకుడు ఫణీంద్ర రూ. లక్ష విరాళం

ఫణీంద్ర

    న్యూస్ ( జనస్వరం ) : స్పందించే మనసుకు మాట అవసరం లేదు.. అర్థం చేసుకునే హృదయానికి వినికిడి అవసరం లేదు. జనసేన పార్టీ ప్రయాణం ఆ మనసుకు అర్థమైంది… జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేస్తున్న సహాయం ఆ మనసును తట్టి లేపింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన తిబిరిశెట్టి వీర ఫణింద్ర బధిరుడు. పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి ధ్వని వినిపించదు, మాట్లాడలేడు. వారిది చాలా పేద కుటుంబం, ఇంట్లోని వారంతా కూలీ పనులు చేస్తున్నారు. అయినా ఫణీంద్ర సంకల్పం చేసుకుని మరీ ఉద్యోగం చేస్తూ.. వచ్చిన డబ్బును రూపాయి, రూపాయి పొదుపు చేసి దాచాడు. అతడి మనసుని తాకిన జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు, పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు తన వంతు సహాయంగా దాచుకున్న సొమ్మును ఇవ్వాలని భావించాడు. జనసేన పార్టీ కోసం దాచిన రూ.లక్ష చెక్ ను ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందించారు. ఫణింద్ర గొప్ప మనసు పవన్ కళ్యాణ్ ను కదిలించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way