Search
Close this search box.
Search
Close this search box.

భారీ వర్షానికి నేల కూలిన రెండు నివాస గృహాలు

     చింతపల్లి సెప్టెంబర్ 7 (జనస్వరం): అల్పపీడన ప్రభావంతో కుంభవృష్టిగా కురిసిన వర్షానికి రెండు నివాస గృహాలు నేల కూలి రెండు గిరిజన కుటుంబాలు నిరాశ్రయులైన సంఘటన కుడుముసారి పంచాయతీలో చోటు చేసుకుంది. నిరాశ్రయులైన గిరిజన కుటుంబాలు అందించిన వివరాలు ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన కుంభ వృష్టి వర్షానికి మండలంలోని మారుమూల పంచాయతీ అయిన కుడుము సారి పంచాయతీ పరిధిలోని మండిపల్లి, కోటగున్నల గ్రామాలకు చెందిన సాగిన సన్యాసమ్మ, పాంగి నారాయణమ్మ ల నివాస గృహాలు నేలమట్టం అయ్యాయి. దీంతో ఆ కుటుంబ సభ్యులు వర్షానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సామాగ్రి తడిసి ముద్ద కావడంతో కనీసం వంట వండుకునేందుకు నిలువ నీడ లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులమంతా రోడ్డున పడ్డామని వారు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way