తూర్పుగోదావరి పిఠాపురం మండలం మల్లాం గ్రామంలో నిర్వహించిన జనసైనికుల జాబితాను తయారు చేసే ప్రక్రియ మరియు ఆత్మీయ సమావేశం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ మండలం అధ్యక్షురాలు శ్రీమతి తోలేటి శిరీష జనసైనికులకు నాయకులకు ముఖ్య సూచనలు ఇచ్చి పార్టీని అందరం కలిసి బలోపేతం చేయాలని అన్నారు. మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నియమించిన ఇంచార్జ్ మాకినీడి శేషు కుమారి గారి అడుగుజాడల్లో మనందరం నడవాలని 2024లో మన జెండా విజయకేతనం ఎగురవేయాలని తెలియజేశారు. ఈ సమావేశంలో సుమారుగా ఒక 40 మంది వరకూ గ్రామ పెద్దలు మరియు 25 మందికి పైగా జనసైనికులు పాల్గొని తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు.. అందరూ కలిసికట్టుగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చెయ్యడంలో ముఖ్య పాత్ర వహించిన మల్లాం జనసైనికులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శ అడపా శివరామకృష్ణ, ఎంపీటీసీ అభ్యర్థి రాసాం శెట్టి కన్యక రావు, పాటి రాంబాబు, మరియు కమిటీ సభ్యులు అయిన యాండపు శ్రీనివాస్, కంద సోమరాజు, సూరిబాబు, గంజి గోవిందరావు, కొండపల్లి శివ, బుర్రా విజయ్, కొనమచిలీ దుర్గాప్రసాద్, కొత్తం గణపతి, కళ్యాణ్, భూపతి, శ్రీధర్, బుర్రా మణికంఠ, ఉదయ్, సునీల్, అమోష్, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
