Search
Close this search box.
Search
Close this search box.

జనసైనికుల పోరాటమే రాష్ట్రానికి శ్రీరామరక్ష

     గుంటూరు ( జనస్వరం ) : ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ కొనసాగిస్తున్న రాక్షసపాలన నుంచి ప్రజల్ని రక్షించుకునేందుకు జనసైనికులు చేస్తున్న పోరాటమే రాష్ట్రానికి శ్రీరామరక్ష అని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగేంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక శ్రీనివాసరవుతోటలోని గాజు గ్లాసు దిమ్మె వద్ద బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగాఫ్యామిలీ అభిమానులందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి వారిని సమాజ సేవకులుగా మార్చిన ఘనత నాగేంద్రబాబుదే అని కొనియాడారు. సినీ రంగంలో అన్న చిరంజీవికి లక్ష్మణుడిలా, రాజకీయ రంగంలో తమ్ముడు పవన్ కల్యాణ్ కు బలరాముడిలా అండగా నాగేంద్రబాబు నిలుస్తున్నారన్నారు. జనసైనికులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ వారిని రాజకీయ యుద్ధరంగంలో కార్యోన్ముఖులుగా తీర్చిదిద్దటంలో నాగబాబు పాత్ర స్ఫూర్తి దాయకమని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి బండారు రవీంద్ర, మెహబూబ్ బాషా, డివిజన్ అధ్యక్షులు గడ్డం రోశయ్య, కొలసాని బాలకృష్ణ, యమ్ సునీల్, కోలా అంజి, కోనేటి ప్రసాద్, వడ్డె సుబ్బారావు, బాలు, సాధిక్, బాలాజీ, అలా కాసులు, రేవంత్, మారాసు అన్వేష్ , తాడికొండ శ్రీను , తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way