జనసేన పార్టీకి ఒక అవకాశం ఇస్తామంటున్నా 12వ డివిజన్ ప్రజానీకం

  ఒంగోలు ( జనస్వరం ) :  ఒంగోలులోని రంగు తోట శివాజీ బొమ్మ ప్రాంతం లో 12వ డివిజన్ అధ్యక్షులు అనిల్ కుమార్ కటకంశెట్టి  ఆధ్వర్యంలో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన నాయకులతో వివిధ వర్గాల ప్రజలు మాట్లాడుతూ ఇప్పటిదాకా అందరికీ ఒక అవకాశం ఇచ్చామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి కూడా ఈసారి ఒక అవకాశం ఇస్తామని అన్నారు. ఆయన చేసిన కార్యక్రమాలు మమ్మల్ని ప్రభావితం చేశాయని, ఆయన సారథ్యం లో తప్పకుండా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. యువతకు ఉపాధి రావాలన్నా, రైతన్నకు అండగా నిలవాలన్నా, మహిళలకు రక్షణ ఉండాలన్న, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్న అది పవన్ కళ్యాణ్  పాలనలోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ తప్పకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పోరాటం చేస్తూనే ఉంటామని, బడుగు బలహీన వర్గాలకు అండగా జనసేన పార్టీ ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి ఆకుపాటి ఉష,28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, మరియు జనసేన నాయకులు అరవింద్ బాబు ముత్యాల, బాయ్రెడ్డి వేణు,సుధాకర్ పసుపులేటి, బన్నీ, అవినాష్ పర్చూరి, సాయి, నవీన్, రవీంద్ర, తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way