గడివిడి ఫ్యాక్టరీ కార్మికులు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్

          విశాఖపట్నం ( జనస్వరం ) : గడివిడి ఫ్యాక్టరీ కార్మికులు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపించాలని జనసేన పార్టీ తరఫున విశాఖపట్నం లేబర్ కమీషనర్ఆఫీసు వెళ్లి డిమాండ్ చేయడం జరిగింది. గుర్తింపు సంఘం ఎన్నికలు జరగగపోవడం వలన వలన కార్మికులు సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. కార్మికులకు రావాల్సిన ఫెసిలిటీస్ రావడం లేదన్నారు. కమిషనర్ ఆఫ్ లేబర్ వారికి జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేయటం జరిగింది.  ఈ యొక్క సమావేశంలో జనసేన నాయకులు  తుమ్మగంటి సూరినాయుడు, అడ్డాల రామచంద్ర రాజు, యూనియన్ నాయకులు, రాజాన రమణ, ఆదినారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email
Facebook