అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన చోటనే తిరిగి పునరుద్ధరించాలని జెఏసి నాయకులకు సంఘీభావం తెలిపిన జనసేన

అంబేద్కర్

      రాయచోటి ( జనస్వరం ) : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోతహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో 5 వ రోజు చేపట్టిన రిలే నిరాహారదీక్షకు సంఘీభావంగా శిబిరాన్ని ఉద్దేశించి జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ… అంబేద్కర్ గారికి అవుమానం జరిగితే జనసేన చూస్తూ ఊరుకోదని అన్నారు. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ జనసేన అండగా ఉంటుందని బాబసాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహం అంటే రాష్ట్ర వైసీపీ ప్రభుత్వానికి, పాలకులకు, అధికార యంత్రాంగానికి ఎందుకంత భయమని నిలదీశారు. వారిలో చిత్తశుద్ధి ఉంటే విగ్రహన్ని తొలగించిన చోటనే తిరిగి ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పాలకులు తక్షణమే స్పందించి త్వరతిగతిన పునరుద్ధరించాలని అదేవిధంగా ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత అవినటువంటి బాబసాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని వెంటనే తొలగించిన స్తానంలోనే నిలబెట్టాలని డిమాండ్ చేశారు. రాయచోటి అసంబ్లీ ఇంఛార్జ్ షేక్ హసన్ భాష మాట్లాడుతూ మన దేశానికి రాజ్యాంగ సృష్టికర్త విగ్రహానికే భద్రత లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేమన్నారు. కాబట్టి అందరూ కలిసి చైతన్యం అవ్వి ఇటువంటి దుర్మార్గాలకు, దుశ్చర్యలకు పాల్పడుతున్న వారిని ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు పఠాన్, జయరామ్, కొండా, వశివుల్లా, ప్రదీప్, జనసైనికులు మరియు జెఏసి నాయకులు, ప్రజాసంఘాలు, అంబేద్కర్ సేన, పలురాజకీయ పార్టీలు, వివిధ మాధ్యమాల నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way