అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలి

     అమలాపురం ( జనస్వరం ) : అంగన్వాడీ వర్కర్ల కనీస వేతనం 26 వేలు చేయాలని, రిటైర్మెంట్ వయస్సు పరిమితి 62 సంవత్సరాల వరకు పెంచాలని, అంగన్ వాడీ ఆయాలను టీచర్లుగా ప్రమోట్ చేయాలని, అంగన్ వాడీ వర్కర్లు అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు ధర్నా చేస్తున్న సంగతి తెలిసిందే. సుప్రీమ్ కోర్ట్ తీర్పు ప్రకారం అందరికీ గ్రాడ్యుటీ ఇవ్వాలని, భీమా సౌకర్యం కల్పించాలని, అంగన్ వాడీ సెంటర్లలకు నాణ్యమైన సరకులు సరఫరా చేయాలనే తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా స్థానిక అమలాపురం ఐ సి డి ఎస్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్ల శిబిరాన్ని జనసేనపార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు సందర్శించారు. వారికి నైతిక మద్దతు తెలియజేయడం జరిగింది. శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండులను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండులను ప్రభుత్వం నెరవేర్చే వరకు వారు చేస్తున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని అన్నారు. వారికి హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే జనసేన తెలుగు దేశం ప్రభుత్వం రానుందని మా ప్రభుత్వం వచ్చినవెంటనే అంగన్ వాడీ వర్కర్ల న్యాయమైన డిమాండులను పరిష్కరిస్తామని రాజబాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ప్రధానకార్యదర్శి సందాడి శ్రీనుబాబు, పార్టీనాయకులు మోకా బాలయోగి, ఆకుల బుజ్జి, పొణకల ప్రకాష్, గండి స్వామి, కుంపట్ల రమేష్, ముత్తాబత్తుల శ్రీను, అర్లపల్లి దుర్గ, ఈతకోట వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way