రాష్ట్ర ప్రగతికి బడ్జెట్ లో ఏమాత్రం తావివ్వని వైకాపా ప్రభుత్వం

    అనంతపురం ( జనస్వరం ) :  జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ శ్రీమతి పెండ్యాల శ్రీలత గారు మహిళలతో మాటామంతి కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా 24వ రోజు అనంతపురం రూరల్ పంచాయతి బైరవనగర్ లో పర్యటించి స్థానిక మహిళలతో మమేకమయ్యి సమస్యలు తెలుసు కొని ఈ విధంగా మాట్లాడారు… రాష్ట్రం అష్ట కష్టాల్లో ఉంటే ఎన్నికల ముందు ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు,ప్రజలు భావించారని కానీ వారు నిరాశపడేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొల్లతనంగా ఎన్నికలే లక్ష్యంగా బడ్జెట్ ను రూపొందించారు తప్ప రాష్ట్ర గతి,ప్రగతిని ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు.. స్పష్టమైన అభివృద్ధి నమూనాను ఆవిష్కరిస్తారని ఆశించిన వారికి బడ్జెట్ నిరుత్సాహపరిచిందని దుయ్యబట్టారు. రెవెన్యూ రాబడులకంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా చూపిన ఈ బడ్జెట్ లో ధరలు మరింతపెరిగి మధ్యతరగతి ప్రజల వినియోగం పై మరింత భారం పడే అవకాశముందని అన్నారు. అప్పులు తెచ్చి నడిపే పథకాలు తప్ప ఆదాయ సృష్టి జరిగే మార్గం చూపలేదని వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రవేశపెట్టిన ప్రతి బడ్జెట్ లో కీలకమైన అన్ని రంగాలను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఇది రాష్ట్ర బడ్జెట్ కాదని జగన్ రెడ్డి వ్యక్తిగత బడ్జెట్ అని ఆమె విమర్శించారు. వీటితో పాటు ఇక్కడ స్థానికంగా మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని రాష్ట్ర గతిని మార్చి ఆంధ్ర ప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా మార్చాలంటే జనసేన టీడీపీ పార్టీలకు ప్రజలు ఓటు వేసి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడాలన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way