నాసిరకపు పనులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం

నాసిరకపు పనులతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం

     వైసీపీ అధికార ప్రభుత్వం తమ కాంట్రాక్టర్లకే పనులు అప్పగించి నాసికరమైన పనులు చేస్తున్నారు. ఈ పనుల వల్ల ప్రజల ప్రాణాల మీదకు ముప్పు వస్తోంది. వివరాల్లోకి వెళ్తే పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం సీతానగరం వంతెనమరమ్మతులు ఇటీవలే చేసినప్పటికీ, వంతెన పైకొత్తగా ఏర్పాటు చేసిన గడ్డరు ఒకటి అకస్మాత్తుగా క్రిందపడి పెను ప్రమాదం తప్పిందని, దీనికి సంబంధించిన అధికారులు సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పనుల్లో నాణ్యత లేదని స్పష్టంగా తెలుస్తోందన్నారు.  సీతానగరం వంతెన మరమ్మత్తులకు దాదాపు 1 కోటి 69 లక్షలు రూపాయలకు పైనే ఖర్చు చేసారు. కానీ నాణ్యత శూన్యం, పైన ఉన్న ఐరన్ రాడ్డు హఠాత్తుగా కింద పడింది, ఆ దేవుడు దయవల్ల ఎవరికీ ఏమి కాలేదు. ఒకవేళ ఏమైనా అయి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు, కాంట్రాక్టరా? లేకపోతే ప్రభుత్వం?  బ్రిడ్జి పై వేసిన స్లాబ్ కూడా అప్పుడే గుంతలు పడుతున్నాయ్, బ్రిడ్జి ఓపెన్ చేసినప్పుడు దాదాపు 20 సంవత్సరాలు చూడక్కర్లేదు అని సంబంధిత అధికారులు అన్నారు కదా మరి ఇదేమిటి కనీసం 2 నెలలు కూడా అవ్వలేదు అని పార్వతీపురం నియోజకవర్గం ఇంచార్జ్ గౌరీ శంకర్, జనసైనికులు రెడ్డి కరుణ, చందక అనీల్ ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way