వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ మొదలైంది

      గుంటూరు ( జనస్వరం ) : రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికేలా ఈ నెల 17 వ తేదీన చిలకలూరిపేట సభ జరగనుందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. దేశ ప్రధాని మోదీ , టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేనాని పవన్ కల్యాణ్ లు పాల్గొనే చారిత్రక సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీలతోనే రాష్ట్రానికి స్వర్ణయుగం సాధ్యమన్నారు. వైసీపీ పాలనలో జరిగిన పాలనా విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్ణించుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఎప్పుడైతే మూడు పార్టీల పొత్తు కుదిరిందో అప్పుడే వైవీపీకి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. సభ అనంతరం వైసీపీ నేతలు అస్త్ర సన్యాసం చేయనున్నారని జోస్యం చెప్పారు. మోదీ , చంద్రబాబు , పవన్ ల నాయకత్వంలోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు సాకారం కానుందన్నారు. వచ్చే ఆదివారం జరగనున్న సభకు టీడీపీ , బీజేపీ , జనసేన పార్టీ శ్రేణులతో పాటూ రాష్ట్ర సంక్షేమాన్ని కోరుకునే ప్రతీ ఒక్కరూ పాల్గొనాలని ఆళ్ళ హరి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way