రైతన్నని పట్టించుకోండి : జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు

రైతన్నని పట్టించుకోండి : జనసేన నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు

              ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కార్యక్రమాలలో అధికార ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే వాగ్వాదాలు చేసుకుంటున్నాయి. అంతేగాని విపత్తు కాలంలో ప్రజల కష్టనష్టాలను, నీవర్ తుఫాను పరిహారాలను, రైతుల పంట నష్టం పరిహారాలను గాలికి వదిలేస్తున్నారని రైల్వే కోడూరు జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ గారు ఆరోపించారు. ఒకరిని ఒకరు వ్యక్తిగతంగా తీవ్రస్థాయిలో దూషించుకుంటూ ప్రజా సమస్యలను గాలికి వదిలేయడం ప్రజలు హర్షించరు అని తెలుసుకోవాలన్నారు. రాష్ట్రం మొత్తం నివార్ తుఫాన్ వల్ల రైతులు చాలా నష్టపోయారని, తక్షణమే వారిని ఆదుకోవాలని కోరారు. అధికార పార్టీ ముఖ్యమంత్రి హెలికాప్టర్లో రైతుల కష్టాలను గుర్తిస్తే, ప్రతిపక్ష పార్టీ చంద్రబాబునాయుడు గారు జూమ్ ఆప్ లో చర్చిస్తున్నారు. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో ప్రజలు, రైతుల కష్టనష్టాలను అంచనా వేస్తూ వారికి సరైన సదుపాయాల కల్పించేందుకు ప్రజల్లోకి రావడం చూసైనా వీళ్ళు మారతారని జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way