బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోండి : జనసేన పార్టీ నర్సీపట్నం ఇంచార్జ్ రాజన్న వీర సూర్య చంద్ర

      నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర మరియు నాలుగు మండలాల అధ్యక్షులు నర్సీపట్నం ఏఎస్పీ గారిని కలిసి విజ్ఞాపన అందించారు. పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేయబోయే అభ్యర్థులు ఇతర పార్టీల వారు బెదిరిస్తున్న పరిస్థితి ఇలాంటి వాతావరణంలో బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోమని A S P గారికి విజ్ఞాపన అందించామని మా అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిందిగా విజ్ఞాపన చేసామన్నారు.  ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా మా జనసేన నాయకులు జనసేన సైనికులు జనసేన అభిమానులు సహకరిస్తామని నాతవరం మండలం చెర్లోపల్లి గ్రామం లో సీసీ కెమెరాలు యాక్టివేట్ చేయమని అంతేకాకుండా ఎలక్షన్ రోజు సీసీ ఫుటేజ్ ఉండేవిధంగా చర్యలు తీసుకోమని విజ్ఞాపన అందించామన్నారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊడి చక్రవర్తి, మాకిరెడ్డి చంటిబాబు, మాకిరెడ్డి నాని బాబు, మాకిరెడ్డి బుజ్జి, రామోజీ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.