తాడేపల్లిగూడెం జనసేన పార్టీలోకి చేరికలు

   తాడేపల్లిగూడెం ( జనస్వరం ) :  నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన గంగిరెడ్ల కులస్తులు రూరల్ మండల అధ్యక్షులు అడప ప్రసాద్ నియోజవర్గ అధికార ప్రతినిధి సజ్జ సుబ్బుల ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇంచార్జ్  బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అనంతరం కుల నాయకులు సిహెచ్ కొండయ్య మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం బీసీలను అన్ని రకాలుగా మోసం చేసిందని రాబోయే జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వం బీసీల కష్టాల్ని తీర్చుతుందన్నారు.. గంగిరెడ్ల ఉన్నతికి బొలిశెట్టి శ్రీను హామీ ఇవ్వడం హర్షనీయమన్నారు. నియోజకవర్గం లోని 3000 మందికి పైగా గంగిరెడ్లు కులస్తులు ఉన్నారని వారిని జనసేన వైపు నడిపే బాధ్యత తీసుకుంటామని అన్నారు. అనంతరం బొలిశెట్టి శ్రీను మాట్లాడుతూ బీసీలకు అండగా అన్ని రకాలుగా వారి ఉన్నతికి కృషి చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మగ్గిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాల్లో వెలుగులు నిండాలంటే వైసీపీని ప్రజలు చిత్తుగా ఓడించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు వర్తనపల్లి కాశీ, నీలపాల దినేష్, మట్ట రామకృష్ణ, కేశవభట్ల విజయ్, బయనపాలేపు ముఖేష్, సండక రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way