గ్రామ స్థాయి నుండి జనసేనపార్టీని బలోపేతం చేయండి : చిలకం మధుసూదన్ రెడ్డి  

చిలకం మధుసూదన్ రెడ్డి  
      ధర్మవరం ( జనస్వరం ) : క్షేత్రస్థాయి నుంచి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తామని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ లోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించి దాదాపు 60 కుటుంబాలు బుధ వారం చేరడం జరిగింది. చేరిన వారి పేర్లు జింక శివకుమార్, సరిబాల రమేష్ రెడ్డి, ఈడిగుడ్డు వెంకట రాముడు, దాసరి కేశవ, యనమల నరసింహ, పూలశెట్టి ముని, దాసరి దామోదర్, సదనపు ఆది, జింక హరికుమార్, గడ్డం శివ, జె. మురళి, ఆర్.అంజి, సి. సి బాబా ఫక్రుద్దీన్, వి. నారాయణస్వామి, ఎం . పరమేష్, ఎస్. బాబావాలి, కె. శ్రీనివాసులు, జి. బాలకృష్ణ, బి. జగదీష్ మరియు మొదలగు వారు చేరారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  చిలకం మధుసూదన్ రెడ్డి  మాట్లాడుతూ జనసేన పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల కోసం నిరంతరం తాను అందుబాటులో ఉంటూ ఎవ్వరికి ఏ ఆపద వచ్చిన తాను ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిలా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మధుసూదన రెడ్డి అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way