రాష్ట్ర ప్రభుత్వము, పాలకులు ప్రజల కోసం పనిచేయండి : జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

   మదనపల్లి, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సినిమాల మీద కాకుండా ప్రభుత్వ పరిపాలనపై దృష్టి సారిస్తే బాగుంటుందని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి అనిత ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది సినిమాల మీద ఆధారపడి ఉంటారు. వారి జీవితాల మీద, వారి ఆర్థిక మూలాలు మీద దెబ్బ కొట్టడం బాధాకరంగా ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తూ సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ ఉంటే మన రాష్ట్ర ప్రభుత్వం అటు సినిమా వాళ్ళని, ఇటు అభిమానులను అందర్నీ ఇబ్బంది చేస్తుంది. ఇలా చేయడం తగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేనిపక్షంలో రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రజలు కచ్చితంగా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం ఖాయమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సినిమావాళ్ల మీద కాకుండా పరిపాలన మీద దృష్టి సారించి ప్రజల శ్రేయస్సుకు పని చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానని అన్నారు.

One Response

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way