Search
Close this search box.
Search
Close this search box.

ఆర్టీసీ చార్జీలు పెంపునకు నిరసన తెలియజేసిన శృంగవరపుకోట జనసేన నాయకులు

ఆర్టీసీ

          శృంగవరపుకోట ( జనస్వరం ) :  ఆర్టీసీ చార్జీలు పెంపునకు నిరసిస్తూ శృంగవరపుకోట నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజల నెత్తిపై పడిన పెను భారాన్ని వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాన్ని ఖండిస్తూ చార్జీలు పెంపును తగ్గించాలని అన్నారు.  కొన్ని నెల్లల వ్యవధిలోనే ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడిపై అధిక భారాన్ని మోపిన ఘనత రాష్ట్ర ప్రభుత్వాన్నిదే అని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లును తగ్గిస్తుంటే ఒకవైపు డీజిల్ పెట్రోల్ రేట్లును తగ్గించకుండా ఆర్టీసీ చార్జీలను పెంచడం ఏంటి అని ప్రశ్నించారు. సమయం సందర్భం లేకుండా ఆర్టీసీ చార్జీలు పెంచడం ఏమాత్రం సమంజసం కాదని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సామాన్య ప్రయాణికున్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ చార్జీలను తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way