కుప్పం ఘటనపై అధిష్టానానికి నివేదిక

– షోకాజ్ నోటీస్ అంటూ తప్పుడు ప్రచారం

– పత్రికాప్రకటన విడుదల చేసిన జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

  తిరుపతి ( జనస్వరం ) :  కుప్పంలో జరిగిన ఘటనపై పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు నివేదిక సమర్పించామన్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రికాప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ అధిష్టానం తనకు షోకాజ్ నోటీసు ఇచ్చినట్టు కొందరు పనిగట్టుకొని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కుప్పంలో ఏం జరిగింది? అన్నదానిపై మూడు అంశాలపై నివేదికను మాత్రమే కేంద్ర కార్యాలయం అడిగిందని చెప్పారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన, టిడిపి పొత్తును జీర్ణించుకోలేక కొందరు పనిగట్టుకొని మరీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మీడియాలో వార్త రాసే ముందు వివరణ కోరి ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way