రావికమతం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

రావికమతం

         విశాఖపట్నం ( జనస్వరం ) : పంటలు నష్టపోయిన రైతులకు సత్వరమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని చోడవరం జనసేన ఇంచార్జి  పి‌వి‌ఎస్‌ఎన్ రాజు డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 9 గంటల కరెంటును నిరంతరాయంగా సప్లై చేయాలి.  కవగుంట రైతులతో సమావేశంలో మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న రైతులను, చక్కెర బకాయిలను చెల్లించకుండా బస్సుయాత్ర పేరుతో రైతులను ప్రజలను మోసం చేస్తున్న YSRCP ప్రభుత్వ వైఖరిని ఖండించారు. పంట నష్టపోయిన కొంత మంది నిరుపేద రైతులకు పార్టీ తరఫున స్వంత నిధులతో కొంత మేర ఆర్ధిక సహాయం చేస్తామన్నారు. వర్షపాతం సగటు కన్నా తక్కువగా వుండడం వలన పంటలు నష్టపోయిన రైతుల కష్టాలు తెలుసుకొనుటకు రావికమతం మండలం నందలి కొమిర, కౌగుంట, కెబిపి అగ్రహారం, గుమ్మాలపాడు గ్రామముల వ్యవసాయ భూములను చోడవరం నియోజకవర్గ ఇంచార్జి  పివిఎస్ఎన్ రాజు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకొన్నారు. కవగుంట గ్రామ రైతులు,మహిళలుతో జరిగిన ముఖా ముఖి సమావేశం లో పంటలు కోల్పోయిన తమకు ఎలా బ్రతకాలో తెలియడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మైచర్ల నాయుడు, పార్టీ నాయకులు బలిజ మహారాజు, లొట్ల శివ, బంటు రామునాయుడు, యతిరాజ్యంభూషణం, పోలమ్మ, గెంజి ప్రసాద్ , కోన రమణ, పరమేశ్ , బండి అర్జున, లోవా, అయితిరెడ్డి రమణ, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way