Search
Close this search box.
Search
Close this search box.

రహదారుల దుస్థితిపై వైసీపీ ప్రభుత్వాన్నినిలదీసిన జనసేన రామ్మోహన్ రావు

రామ్మోహన్ రావు

       ఆముదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గ పరిధిలోనిలోని శ్రీకాకుళం నుండి ఆముదాలవలస ప్రధాన రహదారి దుస్థితిపై నిలదీసిన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు. గత ప్రభుత్వంలో నిధులు మంజూరు కాబడిన నేటికీ రహదారి పనులు పూర్తవుకపోవడం ఇప్పటి ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. ఇక్కడ స్థానికంగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నప్పటికీ కూడా ప్రజల గోడును పట్టించుకునే నాధుడే లేరని వాపోయారు. అలాగే దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ ధరలు మన రాష్ట్రంలోనే వసూలు చేస్తూ రోడ్ల అభివృద్ధిని మాత్రం గాలికి వదిలేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరిచి ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులపై శ్రద్ధ తగ్గించి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సాధించాలని హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way