Search
Close this search box.
Search
Close this search box.

జనసైనికుడి మృతికి న్యాయం జరగాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన రామ్మోహన్

    ఆముదాలవలస ( జనస్వరం ) : విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతో జనసేన నాయకుడు గొర్లె వసంత కుమార్ చనిపోయిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాదానికి కారకులైన విద్యుత్ అధికారులు పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్  పేడాడ రామ్మోహన్ రావు గారు ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగే ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి పరిహారంగా 50 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందిస్తూ వెంటనే ఈ సంఘటన పైన ఎంక్వయిరీ వేయడం జరిగింది. ఈ సంఘటనకు కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని రామ్మోహన్ గారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యలకల రమణ, పైడి మురళీమోహన్, కొత్తకోట నాగేంద్ర మరియు నియోజకవర్గ నాయకులు కొంచాడ సూర్య, మురిపాక రాజశేఖర్, ఎచ్చర్ల కిషోర్ కుమార్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way