అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం నుండి బొమ్మగానీపల్లి పల్లి మీదుగా ఉన్న రోడ్ గత ప్రభుత్వం లో మొదలు పెట్టి అర్ధాంతరంగా ఆపేయడంతో రవాణా ఇబ్బందులు ఎదురయ్యాయని జనసేన నాయకులు అన్నారు. అంబులెన్స్ లు కూడా తిరగడానికి ఇబ్బంది పడుతుండటం ప్రజలు పడుతున్న ఇలాంటి ఇబ్బందుల్ని గుర్తించి జనసేన, బీజేపీ పార్టీ లు ప్రజల కష్టాలను స్థానిక మండల అభివృద్ధి అధికారికి విన్నవించడానికి బైక్ ర్యాలీ గా వెళ్లి ఆ రోడ్ ని రెండు నెలలలో పునర్నిర్మాణం చేపట్టి పనులు మొదలు పెట్టాలని కోరారు. లేదంటే దశల వారిగా ఉద్యమాలు చేపడతామని మరియు బ్రహ్మసముద్రం మండలంలో రోడ్లు లేని ముద్దలపురం వంటి చాలా మారు మూల గ్రామాలకు రవాణా సౌకర్యం కొరకు కొత్త రోడ్ లు కల్పించాలని కోరారు. కళ్యాణదుర్గం నుండి బ్రహ్మసముద్రం వరకు డబుల్ లైన్ అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జనసేన నాయకులు ముప్పూరి దేవరాజు, ఎర్రిస్వామి, రాజేష్, చక్క సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, కరేగౌడ, సుధాకర్, జాకీర్, షైక్ తార, అంజి, తిప్పేస్వామి, అరుణ్,మహేష్, దాసన్న, గోవింద, రజాక్, క్యాతప్ప, దొనస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.
