గాయపడిన జనసైనికుడికి అండగా నిలిచిన పెండ్యాల శ్రీలత, పెండ్యాల హరి

జనసైనికుడి

              అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం నగరంలోని 2వ డివిజన్ కు చెందిన క్రియాశీలక జనసేన కార్యకర్తలు వంశీ, శంకర్ లు ఈనెల 12వ తేదీన జనసేన పార్టీ రైతు భరోసా యాత్ర కు వెళ్లి తిరిగి ఇంటికి వస్తూ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న రాయలసీమ మహిళా విభాగం ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత, పెండ్యాల హరి జనసైనికుల ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఆర్థిక సహాయం, కావలసిన మెడిసిన్ అందించారు. ఈ సందర్భంగా శ్రీలత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి రైతు భరోసా యాత్ర విజయవంతం అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమని అయినా జన సైనికులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మేము ఎప్పుడు అండగా ఉంటామని గాయపడిన జనసైనికులు క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్నందు వల్ల వారికి వైద్య బీమా కింద ఆర్థిక సహాయం అందేలా చూస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశెట్టి సంజీవ రాయుడు, వీర మహిళలు కాశెట్టి సావిత్రి గారు, కుల్లాయమ్మ, శింగనమల నియోజకవర్గ నాయకులు ధంపెట్ల శివ గారు, తోటప్రకష్ గారు, రామయ్య, జన సైనికులు చిన్నమారన్న, సురేష్, వెంకీ, మోక్షిత్, సునీల్, మనోజ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way