Search
Close this search box.
Search
Close this search box.

పెద్దాపురం జనసేన పార్టీ పట్టణ యువత ఆధ్వర్యంలో చలివేంద్రము ఏర్పాటు

     పెద్దాపురం, (జనస్వరం) : బాటసారులకు దాహం తీర్చేందుకు చలివేంద్రాలు ప్రతి ఒక్కరూ వీధివీధిన ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. ఆదివారం పెద్దాపురం పట్టణంలో పెద్దాపురం జనసేన పార్టీ పట్టణ యువత ఆధ్వర్యంలో సంత మార్కెట్ వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని తుమ్మల రామస్వామి బాబు చేతులు మీదుగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండుటెండల్లో బాటసారులకు దాహం తీర్చేందుకు ప్రజలకు ఈ చలివేంద్రములు దోహదపడుతుందని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో పులిమేరు, సామర్లకోట పలు ప్రాంతాల్లో జనసేన పార్టీ యువత సహాయ సహకారాలతో ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ సహాయ కార్యదర్శులు చిటికెల నారాయణమూర్తి, కంచు మూర్తి రాజన్న, పిట్ట జానకి రామారావు, పెద్దాపురం 20 వార్డు కౌన్సిలర్ ఓబిలి శెట్టి వనిత, గణేష్, పెంకే వెంకట లక్ష్మి, పొలమరశెట్టి సత్తిబాబు, కటారి శ్రీను సహారా కోటి, ధర్మ, వంగలపూడి సతీష్ గున్ని, భగవాన్, బర్రె స్వామి మంచం సాయి, అత్తిలి కృష్ణ, చిటికెల త్రివేణి, ఎస్. ఎస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way