నుకలాపుపేట గ్రామంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం

పవనన్న

     ఎచ్చెర్ల ( జనస్వరం ) :  లావేరు మండలం గోవిందపురం పంచాయతీ నుకలాపు పేట గ్రామంలో జనసేన నాయకులు కరిమజ్జి మల్లీశ్వరావు ఆధ్వర్యంలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా కరిమజ్జి మల్లీశ్వారావు మాట్లాడుతూ గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో వ్యవహరించాల్సిన తీరును ఆయన వివరించారు. గ్రామాల్లో పార్టీ యొక్క మేనిఫెస్టో, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అందుకు త్వరలోనే మండలాల వారిగా గ్రామ పర్యటనకు శ్రీకారం చుడతామని ఆయన అన్నారు. అందేవిధంగా గ్రామ స్ధాయిలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలవడం జరిగిందన్నారు. జనసేన నాయకులు పోట్నూరు లక్ష్మునాయుడు మాట్లాడుతూ  పవనన్న ప్రజాబాట ప్రారంభించి 87వరోజు సుదీర్ఘంగా ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి మేనిఫెస్టో గురించి వివరంగా చెప్పడం జరిగిందన్నారు. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో సోమినాయుడు, అప్పారావు, గౌరి నాయుడు, తిరుపతిరావు.గంగాధర్, గ్రామం పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way