పవన్ కళ్యాణ్ గారి చిత్రా పటానికి పాలాభిషేకం చేసిన జనసైనికులు

పవన్ కళ్యాణ్

          ఆత్మకూరు ( జనస్వరం ) : ఆత్మకూరు నియోజకవర్గం అనంత సాగరం మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థను మొత్తాన్ని తప్పు పట్టలేదని, వ్యవస్థలో కొంతమంది చేసే పనులను మాత్రమే చెప్పారని అన్నారు. అలాగే వాలంటీర్లుగా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ల సైతం అయిదు వేల రూపాయల కోసం వాలంటీర్ జాబ్ చేస్తున్నారన్నారు. అంటే రోజు కు 166 రూపాయలు తో 10 గంట లు చాకిరీ పని చేయడం దారుణమని, వారికి తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మంచి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలని  పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. తప్ప కొంతమంది వైసీపీ నాయకులు కావాలని వాలంటీర్లను కించపరచారని దుమారం రేపడం సరికాదన్నారు. వారాహి యాత్ర విజయవంతంగా సాగుతున్న సందర్భంగా వైసిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద కుట్ర పన్నినట్టు తెలుస్తుంది అన్నారు. వైసిపి నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ అధ్యక్షులుశ్రీ పవన్ కళ్యాణ్ గారి జోలికొస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు షేక్ కరిముల, మంగు దొడ్డి హరి కృష్ణ నాగభూషణం, వెంకట్ రమణ, పెనగలురు చిన్నయ్య, గల్ల నాగ రాజు, అజయ్ తదితర పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way