పవన్ కళ్యాణ్ గారితోనే మా భవిష్యత్తు అంటున్న ఒంగోలు ప్రజానీకం

    ఒంగోలు ( జనస్వరం ) : స్థానిక నాయకులు నరసింహారావు, పి. రాజేంద్ర ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తెలుసుకోవడంలో భాగంగా 61వ రోజు ఒంగోలులోని 9వ డివిజన్ ఇందిరమ్మ కాలనీ లో పర్యటించారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా స్థానిక యువత మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితోనే మాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం యువతను అభివృద్ధి పరిచిన పాపాన పోలేదని అన్నారు. యువతను ఓటు బ్యాంక్ గాని చూశారని కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు యువతే రాష్ట్ర అభివృద్ధి కీ కీలకమనీ మాట్లాడుతూనే ఆచరణలో కూడా రాజకీయంగా యువతకు పెద్ద పీట వేయటం మాకు నచ్చిందని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన కార్యదర్శి గోవింద్ కోమలి, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష,వీర మహిళ మాదాసు సాయి నాయుడు, 28వ డివిజన్ అధ్యక్షులు కోట సుధీర్, జనసేన నాయకులు చెన్ను నరేష్, ఉంగరాల వాసు,సాయి, రవీంద్ర, రవీంద్ర, నవీన్, తాటిపత్రి జాన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way