Search
Close this search box.
Search
Close this search box.

కాకినాడలో జనం కోసం పవన్ – పవన్ కోసం మనం కార్యక్రమం

    కాకినాడ ( జనస్వరం ) : కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం యండమూరు గ్రామంలోని వడ్డీపాలెం ప్రాంతంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం చేపట్టారు. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా జనసేన నాయకులు గంజా దుర్గా ప్రసాద్, కుక్కల మల్లేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేశారు. జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమస్యల గురించి తెలుసుకున్నారు.  ప్రజలు వారి సమస్యలను విన్నవించారు. వడ్డీపాలెంలో సరైన రహదారులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని వడ్డీపాలెం నుండీ వేళంగికి వెళ్లే ఏటిగట్టు రోడ్డు కి శంకుస్థాపన చేసి వదిలి పెట్టేసారు. ఎన్ని సార్లు చెప్పిన స్థానిక వైసీపీ ఎమ్మెల్యే పట్టించుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన నిధులను వాకాడ గ్రామానికి మల్లించి ఇక్కడ పనులు నిలిపివేసిన వైసీపీ ఎమ్మెల్యే.  స్థానికులకు ఉపాధి లేక దూర ప్రాంతాలకు వలస వెళ్లిపోవడంతో గ్రామం అంత ఖాళీగా ఉంది. ఆరోగ్య శ్రీ కార్డులు పనిచేయక పోవడం తో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, మంచి నీరు ట్యాంక్ శుభ్రం చేయడం లేదు అని ఇలా అనేక సమస్యలు తెలిపారు… త్వరలోనే జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం రాబోతోందని మీ సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన వడ్డీపాలెం యువత మరియు టీడీపీ నాయకులు పిల్లి శ్రీను, పిల్లి రమేష్, గుబ్బల అప్పారావు, మేడిశెట్టి భద్రరావు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way