నెల్లూరు ప్రధాన సమస్యల గూర్చి నాగబాబుకు వివరించిన నెల్లూరు జనసేన నాయకులు

    హైదరాబాద్, (జనస్వరం) : నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, ఉయ్యాల ప్రవీణ్,అళహరి సుధాకర్ లతో కలిసి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, మెగా బ్రదర్ శ్రీ కొణిదల నాగబాబు అన్న గారిని హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా, ఆత్మకూరు నియోజకవర్గ ప్రధాన సమస్యల గురించి మరియు ప్రజల తరఫున జనసేన పార్టీ చేస్తున్న పోరాటాల గురించి నాగబాబు గారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా నియోజకవర్గ ప్రధాన సమస్యలైన చుక్కల భూమి సమస్య, సమగ్ర సోమశిల, నడికుడి శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి సంబంధించి భూసేకరణలో ప్రభుత్వ యంత్రాంగం యొక్క అంతులేని నిర్లక్ష్యం, నియోజకవర్గ రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చే ఆనం సంజీవరెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో జరుగుతున్న అంతులేని జాప్యం, వరదల కారణంగా దెబ్బతిన్న సోమశిల జలాశయం మరమ్మతులు విషయంలో ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి గురించి వివరించడం జరిగింది. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా పూర్తిగా ధ్వంసమైన రోడ్ల పరిస్థితి, మెట్ట ప్రాంతమైన ఆత్మకూర్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేకూర్చే పరిశ్రమను, కడప జిల్లాకు తరలించిన విషయంలో ప్రజల పక్షాన జనసేన పార్టీ నిలబడి చేసిన పోరాటాలు, ఈ సమస్యల అన్నిటి పై ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిపిన ఆమరణ నిరాహార దీక్ష మొదలగు అన్ని ప్రజా సమస్యలపై జనసేన పార్టీ చేసిన పోరాటాల గురించి తెలియజేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way