క్రియాశీలక సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు ఇన్సూరెన్స్ బాండ్లు అందించిన మైలవరం ఇంఛార్జ్ అక్కల రామ మోహన రావు (గాంధి)

      మైలవరం,  (జనస్వరం)   :  మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ లో  క్రియాశీలక సభ్యత్వం వున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉండాలని దురదృష్టకరంగా ఎవరికి అయినా ప్రమాదం జరిగి ప్రాణాలు పోయిన వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని,  ప్రతి కార్యకర్త కు 5 లక్షలు రూపాయులు ఇన్సూరెన్స్ కల్పించటం జరిగింది. అలాగే ప్రమాదం జరిగి హాస్పటల్ లో  చికిత్స చేసుకోన్న వారికి ఖర్చులు నిమిత్తం  50 వేలు రూపాయులు ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజు గొల్లపూడి గ్రామ పంచాయతీ జనసేన పార్టీ ప్రెసిడెంట్  k. ధర్మారావు గారు ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ బాండ్స్ ను మైలవరం నియోజకవర్గం ఇంఛార్జ్  రాష్ట్ర అధికార ప్రతినిది అక్కల రామ మోహన రావు (గాంధి) గారు చేతులు మీదుగా ఇవ్వటం జరిగింది. ఈ సందర్బంగా గాంధి గారు మాట్లాడుతూ కార్యకర్తలకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్తకు పార్టీ లో  పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు అని అన్నారు. రాబోయే రోజుల పార్టీ బలోపేతానికి అధికారం లో రావటానికి ప్రతి ఒకరు కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇన్సూరెన్స్ కల్పించినందుకు కార్యకర్తలు అభినందనలు తెలపటం జరిగింది. ఈ కార్యక్రమం లో పార్టీ  గ్రామ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ మూర్తి గారు ఎంపీటీసీ సభ్యులు కాంత కుమారి గారు, కిరణ్ గారు , ప్రవీన్ గారు, ప్రసాద్ గారు వీరమహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.