విజయవాడ 48వ డివిజన్‌ సంయుక్త కార్యదర్శిగా ఎండీ సుభాని

     విజయవాడ, (జనస్వరం) : స్థానిక 48వ డివిజన్‌ జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శిగా ఎండీ సుభాని ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్‌ చేతుల మీదుగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్‌ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పార్టీ విలువలతో కూడిన రాజకీయ పార్టీ రూపుదిద్దినట్లు తెలిపారు. పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలుపుకునేలా జనసైనికులు కృషి చేయాలని సూచించారు. అనంతరం సంయుక్త కార్యదర్శి ఎండీ సుభాని మాట్లాడుతూ మాట్లాడుతూ పార్టీ అధినాయకుడు, నాయకులు తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించారని తెలిపారు. వారు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో, విధేయతతో నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way