Search
Close this search box.
Search
Close this search box.

జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యములో పార్టీలోకి పలువురు యువకులు చేరిక

    విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నంలో 81వ వార్డులో  విద్యావేత్త చరకం పార్వతి గారు ఉత్తరాంధ్ర జనసేన పార్టీ కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ గారి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ గారి ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనపార్టీలో చేరినట్టు పార్వతి తెలిపారు. 81వార్డులో విద్యావేత్తగా తనకు జనంతో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయని ఆ వార్డు  ప్రజల సమస్యలపై అవగాహన ఉందని వారికి సేవచేయడానికి సిద్దమై, జీవీఎంసీ ఉపఎన్నికలలో పోటే చేయుచున్నాను అన్నారు. జనసేన పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలే తనను గెలిపిస్తాయని ధీమావ్యక్తం చేశారు. దక్షిణ నియోజకవర్గం పార్టీ నేత పందిరి శివ ప్రసాద్‌ ఆధ్వర్యంలో పార్వతీతో పాటు యువకులు 20 మందికి పైగా పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వన్నెంరెడ్డి సతీష్‌ కుమార్‌, బీసెట్టి గోపికృష్ణ, గరికిన రవి, మూగి శ్రీనివాస్, యర్రంశెట్టి సురేష్‌ కుమార్‌, తేతల వీరేంద్ర రెడ్డి జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way