జనసేన పార్టీ జెండా దిమ్మెలను ప్రారంభించిన కృష్ణా జిల్లా జనసేన నాయకులు

    జగ్గయ్యపేట, (జనస్వరం) : కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం, వత్సవాయి మండలం పోలంపల్లి, కంభంపాడు గ్రామంలో జనసేన పార్టీ జెండా దిమ్మెలను కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్ గార్ల సమక్షంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల నుండి ఏ పార్టీ కూడా కార్యకర్తల శ్రేయస్సు గురించి ఆలోచించలేదని పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల గురించి ఆలోచించి క్రియాశీలక సభ్యత్వం లాంటి గొప్ప కార్యక్రమానికి నాంది పలికారని జగ్గయ్యపేట నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురవేయాలని, పవన్ కళ్యాణ్ గారిని సీఎంను చేయడమే మన లక్ష్యం అని, ఆ దిశగా కార్యకర్తలు ఆడుగులు వెయ్యాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బాడీసా మురళి కృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్, మూడు మండల అధ్యక్షులు, తులసి బ్రహ్మం, రేంగండ్ల వెంకటరామయ్యా, తునికపాటి శివ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way