MPP ఉన్నత పాఠశాల మూసివేతను వ్యతిరేకిస్తూ MEO గారికి వినతిపత్రం అందజేసిన కోవూరు జనసేన నాయకులు

     కోవూరు, (జనస్వరం) : నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పరిధిలోని కోవూరు మండలం గుమ్మళ్ళదిబ్బ గ్రామంలో ఉండే MPP ఉన్నత పాఠశాల మూసివేతకు వైసీపీ ప్రభుత్వం నుంచి జరిగే కుట్రకోణాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు కోవూరు నియోజకవర్గం జనసేనపార్టీ ఆధ్వర్యంలో కోవూరు MEO ని కలిసి ఆ పాఠశాలను మూసివేసే విషయమై ఏ ప్రాతిపదికన మూసివెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మూసివేతకు సంభందించి పై అధికారుల నుంచి వచ్చిన ఆర్డరు నకలు కాపీలను ప్రతి పేజిని ధృవీకరించి ఇవ్వవలసిందిగా సమాచార హక్కు చట్టం కింద అడగడం జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బద్ధిపూడి సుధీర్, నెల్లూరు జిల్లా IT వింగ్ కోఆర్డినేటర్ నక్కల శివకృష్ణ, కోవూరు నియోజకవర్గ జనసేనపార్టీ నాయకులు చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, కోవూరు మండల జనసేనపార్టీ అధ్యక్షుడు షేక్ అల్తాఫ్, కోవూరు మండల ఉపాధ్యక్షుడు నరాలసెట్టి మహేష్, కోవూరు మండల జనసేనపార్టీ ప్రధాన కార్యదర్సులు సాయి కృష్ణ, పవన్, ప్రదీప్, సంయుక్త కార్యదర్శి రఘు, జనసైనికులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way