తొమ్మిది సంవత్సరాల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కామంధుడిని కఠినంగా శిక్షించాలి : వీరఘట్టం జనసేన నాయకులు

     వీరఘట్టం, (జనస్వరం) : వీరఘట్టం మండలం కిమ్మి గ్రామంలో ఈ నెల రెండవ తేదీన తొమ్మదేళ్ల చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడిన కామంధుడిని కఠినంగా శిక్షించాలని నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కిమ్మి గ్రామంలో బాధిత కుటుంబాన్ని పాలకొండ నియోజకవర్గ జనసేనపార్టీ నాయుకులు బుధవారం పరామర్శించారు. బాధితులను ఓదార్చి, వారికి జనసేన పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయుకులు మాట్లాడుతూ అభం, శుభం తెలియని చిన్నారిపై సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన వాడిని కఠినంగా శిక్షించాలని, దానిని చూసి భవిష్యత్‌లో ఎవరూ కూడా ఇటువంటి పాపానికి ఒడిగట్టాలనే ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా చట్టాలను రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గం నాయుకులు జనసైనికులు రౌతు గోవిందరావు, గొర్ల మన్మధ రావు, మత్స. పుండరీకం, జనసేన జానీ, పోరెడ్డి ప్రశాంత్, పొట్నూరు రమేష్, జామి అనిల్, కడగల హరికృష్ణ, గణేష్, వినోద్, అనిల్, సందీప్, వావిలపల్లి నాగభూషణ్, దత్తి గోపాల్, కర్ణేన సాయిపవన్, దండేల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way