ఎచ్ఛర్ల నియోజకవర్గంలోకి వైసీపీ, టీడీపీ పార్టీల నుండి జనసేనలోకి చేరికలు

ఎచ్ఛర్ల

         ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ గారి అధ్వర్యంలో రణస్థలం మండలం నుంచి వైసీపీ, టీడీపీ పార్టీల నుంచి సుమారు 200 కుటుంబాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విశ్వక్షేణ్ జనసేనపార్టీ లోకి కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. వారు మాట్లాడుతూ వన్ కళ్యాణ్ గారి భావజాలాలు నచ్చి పార్టీలో చేరడానికి అనేకమంది ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. నేడు పార్టీలోకి చేరిన వారిలో అధికమంది యువత ఉండడం శుభపరిణామమని అన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని, రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజు, జి.సిగడాం మండల నాయకులు మీసాల రవికుమార్, (సర్పంచ్ నిద్దాం) జనసేన నాయకులు కరిమజ్జి మల్లేశ్వరరావు, శ్రీ బలరాం, మధుబాబు, సువ్వాడ రామారావు, అప్పలనాయుడు, రెడ్డి వెంకటరమణ, సందీప్  జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way