అత్యాచారానికి గురైన 5 ఏళ్ల బాలికను పరామర్శించిన జనసేన వీర మహిళలు
కాకినాడ నందు దండోరా వీధిలో 5 సంవత్సరాల బాలికపై ఒక యువకుడు అత్యాచారం చేసిన వార్తను వెలుగుచూడడం మనసును చాలా చలింపచేసే ఘటన. ఆ పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసి పాపని జనసేన వీరమహిళలు పరామర్శించారు. అలాగే కుటుంబ సభ్యులకి మనో దైర్యాన్ని ఇవ్వడం జరిగింది. బాధిత బాలికకి న్యాయం జరగాలని, నిందుతున్ని వెంటనే అరెస్ట్ చేసి, కఠిన శిక్షలు వెయ్యాలని జనసేనపార్టీ తరుపున వీరమహిళలంతా డిమాండ్ చెయ్యడం జరిగింది. జనసేన వీర మహిళ కృష్ణవేణి సుంకర గారు మాట్లాడుతూ మన రాష్ట్రంలో అమ్మాయిలకు రక్షణ కరువయ్యిందని అన్నారు. రాష్ట్రానికి ఒక మహిళా హోమ్ మంత్రి ఉండి కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వడం వారి నిర్లక్ష్య పరిపాలన తెలియజేస్తోంది. దిశా చట్టం పేరు చెప్పి పబ్లిసిటీ చేసుకున్నారే తప్ప, అమ్మాయిలకు రక్షణ ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సుంకర కృష్ణవేణి గారు, కొప్పుల నాగమానసగారు, చిక్కం సుధగారు, పిడకా వెంకటలక్ష్మిగారు, యనమండ్రలీలగారు, డి.శిరీష గారు పాల్గొన్నారు.