అరకు నియోజకవర్గంలో జనసేనపార్టీ కార్యకర్తలు ఆత్మీయసమావేశం

    అరకు, (జనస్వరం) : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం ముంచంగిపుట్టు మండలంలో జనసేనపార్టీ మండల అధ్యక్షుడు జవహర్ ఆధ్వర్యంలో జరిగిన మండల కార్యకర్తల సమావేశం నియోజకవర్గం అన్ని మండల ముఖ్యనాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భముగా జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ జనసేనపార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పార్టీని భలోపేతం చేయాలని, జనసేనపార్టీ భావజాలం, సిద్ధాంతాలు ప్రజల్లో బలంగా తీసుకుని వెళ్ళాలని అన్నారు. అలాగే జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న రైతు భరోసా యాత్రలో భాగంగా ఆత్మ హత్య చేసుకున్న రైతులకు ఒక కుటుంబానికి లక్షరూపాయలు ఇస్తున్న గొప్ప కార్యక్రమాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు. పార్టీ భలోపేతమే లక్ష్యంగా అందరూ కలిసి గ్రామస్థాయిలో పార్టీ భలోపేతమే చేయాలని కార్యకర్తలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కమిటీ సభ్యులు కొనెడి లక్ష్మణరావు, శెట్టి ఆనంద్, శెట్టి చిరంజీవి, కోటి, సాయిబాబా, రామదాసు, ముంచంగిపుట్టు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.