జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి

జనసేన పార్టీ

        ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండలం నాగలుబ్బల గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీ కార్యకర్త సాకే రాజు (60) కరోనా సమయంలో గుండె పోటుతో చనిపోవడం జరిగింది. అయితే కరోనా సమయంలో హాజరు కాలేని పరిస్థితి వలన, ఇప్పుడు వీలు చూసుకొని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మరియు PAC సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు మరియు ముదిగుబ్బ మండలం, నాగలుబ్బల గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వయంగా వారి ఇంటికి వెళ్లి మృతి చెందిన సాకే రాజు భార్య సాకే లక్ష్మీనారాయణ, మరియు కొడుకు సాకే హరి, వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి మేము, జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటామని వారికి మనో ధైర్యం చెప్పి, ఆర్థిక సహాయంగా రూ 10 వేల రూపాయలనుఅందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదిగుబ్బ మండలానికి చెందినటువంటి జనసేన పార్టీ కన్వీనర్ గుర్రం జయ చంద్ర, కొడవండ్ల పల్లి నరేంద్ర, ముక్తాపురం గోపీనాయక్, రామాంజనేయులు, రాజశేఖర్, కోన శేఖర్, అలాగే నాగలుబ్బల గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు హరికృష్ణ, మధు, హరి, రాజు, వినోద్, రాజశేఖర్ మరియు ధర్మవరం జనసేన పార్టీ నాయకులు చిలకం వెంకట రెడ్డి, అడ్డ గిరీ శ్యామ్ కుమార్, గొట్లూరు రామాంజనేయులు, నాయుడు నాయక్, మరియు జనసేన పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way