పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి సిద్ధం : మంత్రాలయం ఇంచార్జ్ లక్ష్మన్న

                మంత్రాలయం నియోజకవర్గంలో పంచాయితీ  ఎన్నికల్లో సర్పంచ్‌ పదవీకి జనసేన పార్టీ పోటీ చేస్తుందని మంత్రాలయం నియోజకవర్గఇంచార్జ్    లక్ష్మన్న గారు అన్నారు. మంత్రాలయంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలకు అనుగుణంగా నడవాలని, గ్రామాల అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పంచాయితీ ఎన్నికల్లో డబ్బు ప్రమేయం లేకుండా నీతి నిజాయితీగా జనసేన పార్టీ కార్యకర్తలు పోటీ చేస్తారని తెలిపారు. తమ అధినేత రూ.కోట్ల ఆదాయం వచ్చే సినీ పరిశ్రమను వదిలి ఒక సామాన్య వ్యక్తిగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేన్తున్నాడని తెలిపారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, కార్యకర్తలు దొడ్డయ్య, హనుమంతు. మున్నా ఏసేవు, వేమన్న, నాగరాజు, నాగార్జున, రవిచంద్ర తదితర జనసైనికులు పాల్గొన్నారు.