800 మంది బాధిత కుటుంబాలకు బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేసిన జనసేన నాయకులు వేగుళ్ళ లీలాకృష్ణ

జనసేన

          మండపేట ( జనస్వరం ) : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కపిళేశ్వరపురం మండలం అద్దంకివారిలంక ముంపు ప్రాంతాల్లో మండపేట నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పర్యటించారు. గ్రామంలో 800 మంది కుటుంబాలకు 5కేజీల బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది రోజులుగా లంకలన్నీ వరద ముంపులోనే ఉన్నాయన్నారు. వారిని ఆదుకోవడానికి వేగుళ్ళ లీలాకృష్ణ పార్టీ నాయకులతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి సహాయక చర్యలు చేపట్టారు. పంటలు నష్టపోవడంతో కన్నీరు మున్నీరైన రైతులు తమ గోడును ఆయనకు వినిపించారు. అద్దంకివారిలంక లోని గ్రామాలు పూర్తిగా నీట మునిగి దిక్కు తోచని స్థితిలో ఎదురు చూస్తున్నారని చెప్పారు. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వమే పూర్తి సహాయం చేయాలని ఆయన డిమాండ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way