తాడేపల్లిలో వరద ముంపు గ్రామాలను సందర్శించిన జనసేన నాయకులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు

తాడేపల్లిలో వరద ముంపు గ్రామాలను సందర్శించిన జనసేన నాయకులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు

             తాడేపల్లి మండలం కొలనుకొండ, గుండిమెడ, చిర్రావూరు గ్రామాలలో నివర్ తుఫాన్ వల్ల నీట మునిగిన వరి పొలాలను పరిశీలించి రైతుల ఆవేదనను తెలుసుకున్న జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పరిశీలించారు.  తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం గిట్టుబాటు ధరతో రైతుల దగ్గర్నుంచి కొనాలని, కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా గా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, నష్టపోయిన రైతులను రాజకీయ పార్టీల వారీగా వేరు చేయకుండా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గుండిమెడ గ్రామ VRO గారితో మాట్లాడి రైతులకు పూర్తి న్యాయం జరిగేలా దాని నివేదిక ఇవ్వాలని సూచన చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ద్వారా రైతుల తరపున ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.