పిడుగుపడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

          కృష్ణా ( జనస్వరం ) : పిడుగుపడి మృతి చెందిన బాలుడు గంధం శంకరయ్య తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా కుటుంబానికి జనసేన పార్టీ తరపున జనసైనికులతో కలిసి 12,000 ఆర్థిక సాయం అందించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకులు రోసనూరు సోమశేఖర్, అనంతరం దొరవారి సత్రం మండల MRO గారిని కలిసి, ఉన్న ఒక్క కొడుకుని కోల్పోయి నిరుపేదరికాన్ని అనుభవిస్తూ పూర్తిగా దుఃఖంలో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆర్థికంగా అండగా నిలవాలని కోరడం జరిగింది.