జవాన్ మరుప్రోలు జస్వంత్ కు ఘన నివాళులు అర్పించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు

జవాన్

             గురువారం జమ్మూ కాశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో మారుప్రోలు జస్వంత్ రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లాకు చెందిన దేశ  సైనికుడు మారుప్రోలు జస్వంత్ రెడ్డి జిల్లాలోని బాపట్ల మండలంలోని దరివాడ కొఠపాలెం గ్రామానికి చెందినవాడు. రాజౌరి జిల్లాలోని సుందర్‌బానీ సెక్టార్‌లో జరిగిన తిరుగుబాటు ఆపరేషన్ సందర్భంగా ఈ సంఘటనలో అమరులైనారు. ఈ  సందర్భంగా  విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన నాయకుడు ధర్మేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు పీలా రామకృష్ణ గారు అతిథిగా పాల్గొని మరణించిన సైనికుడికి నివాళులు అర్పించారు. సైనికుడి వీరమరణం పట్ల మౌనం పాటించి, తర్వాత వారి ప్రాణత్యాగం గురించి కొనియాడారు. ఉగ్రమూకలను ఎదురొడ్డి అశువులు బాసిన మారుప్రోలు జస్వంత్ రెడ్డి అమరహే అంటూ నినాదాలు చేస్తూ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీకాంత్, తదితర జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way