Search
Close this search box.
Search
Close this search box.

నీట మునిగిన పంటలను పరిశీలించిన కోవూరు నియోజకవర్గం జనసేన నాయకులు

కోవూరు

               నెల్లూరు ( జనస్వరం ) : సంక్రాంతికి రైతులకు అండగా ఉండాలని జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు అదేవిధంగా నెల్లూరు జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి నాయకత్వంలో  కోవూరు నియోజకవర్గం జనసేన నాయకులు నీట మునిగిన పంటలను పరిశీలించారు. గౌరీపురం గ్రామంలో అకాల వర్షాలకు నీట మునిగిన వేరుశనగ పంట పొలాలను పరిశీలించి, పంట వేసిన రైతులను కలుసుకుని జరిగిన నష్టాన్ని అంచనా వేశారు.  ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేవిధంగా పోరాటం చేసి రైతులను ఆదుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో విడవలూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు కమతం శ్రీనాధ్ యాదవ్, జిల్లా ప్రధానకార్యదర్శి మున్వర్ బాషా, కోవూరు మండలం జనసేనపార్టీ అధ్యక్షులు షేక్ అల్తాఫ్, చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, సాయి కృష్ణ, కడియాల రాము, శివ కుమార్, రాజా, శ్రీకాంత్ మరియు రైతులు , జనసైనికులు , గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way